Telugudesam: సభాసంప్రదాయాల గురించి టీడీపీ నేతలా మాట్లాడేది?: డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి
సభాసంప్రదాయాల గురించి టీడీపీ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, ఆరోజున తమ ఎమ్మెల్యే రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారని, నాడు నిండు సభలో కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మార్షల్స్ మోసుకుని తీసుకెళ్లిన సంఘటనలను ఆమె గుర్తుచేశారు. ఆరోజున ప్రతిపక్ష నేత జగన్ గురించి దారుణంగా మాట్లాడిన టీడీపీ నేతలు ఈరోజు సభా సంప్రదాయాల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు.