84 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నేరస్తులే... వారినెందుకు ఎన్ కౌంటర్ చేయలేదు?: దేవి
- దిశ నిందితుల ఎన్ కౌంటర్
- ప్రజా సంఘాలు, మేధావి వర్గాల నుంచి వ్యతిరేకత
- కసబ్ వంటి తీవ్రవాదిని కూడా చట్టప్రకారమే శిక్షించారన్న దేవి
84 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని నిలదీశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను చట్టం ముందు నిలపాలని, దీనిపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని దేవి వెల్లడించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే నిందితులను అంతమొందించారని వ్యాఖ్యానించారు.