Vijayawada: విజయవాడ, పున్నమి ఘాట్ వద్ద మత మార్పిడులు.. స్థానికుల ఆగ్రహం

  • పున్నమి ఘాట్ లో 47 మందికి మత మార్పిడులు
  • లౌడ్ స్పీకర్లు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన వైనం
  • పున్నమి రిసార్ట్స్ గేట్ ఆర్చ్ కి మేరీమాత విగ్రహం
మత మార్పిడుల వ్యవహారం విజయవాడలో కలకలం రేపుతోంది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న పున్నమి ఘాట్ వద్ద మత మార్పిడులు జరిగాయి. దాదాపు 47 మందికి మతమార్పిడులు చేసినట్టు తెలుస్తోంది.

లౌడ్ స్పీకర్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు, పున్నమి రిసార్ట్స్ గేట్ ఆర్చ్ కి మేరీమాతం విగ్రహాన్ని వేయండంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో... ఈ మత మార్పిడుల వ్యవహారం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.
Vijayawada
Religion Conversion

More Telugu News