Nara Lokesh: నవరత్నాలు అని చెప్పి.. నవరత్న తైలం రాశారు: నారా లోకేశ్

  • అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే జగన్ మాట మార్చారు
  • రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచారు
  • రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారు
రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ వంచించారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాట మార్చి జనాల నెత్తిన నవరత్న తైలం రాశారని విమర్శించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పారని... కానీ, రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. విధ్వంసంతో పాలనను ప్రారంభించిన వైసీపీ... ఆరు నెలలలో రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చిందని చెప్పారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Jagan
Telugudesam
YSRCP

More Telugu News