Tsrtc: ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
రేపటి నుంచి విధుల్లో చేరాలని టీఎస్సార్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పిన కేసీఆర్, నష్టాలను తగ్గించేందుకే ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించారు. టీ-కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, వచ్చే సోమవారం నుంచి బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని అన్నారు. కిలోమీటర్ కు 20 పైసల చొప్పున పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతిచ్చినట్టు చెప్పారు. వారం రోజుల్లో డిపోల వారీగా కార్మికులతో నేరుగా తానే మాట్లాడతానని, ప్రతి నెలా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.  
Go Back to Shorts
Tsrtc
cm
kcr
Bus charges
hike

More Telugu News