KTR: ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది: కేటీఆర్

  • గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిన కారు
  • పాదచారి మృతి బాధాకరమన్న కేటీఆర్
  • ఫ్లైఓవర్ డిజైన్ లోపాలుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి ఓ కారు కిందపడిపోయిన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఫ్లైఓవర్ పై 40 కిలోమీటర్ల వేగం మించరాదని హెచ్చరిక బోర్డులు స్పష్టంగా పేర్కొంటున్నాయని, కానీ ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని, అతివేగంతో అదుపుతప్పిందని తెలిపారు.

 ఏదేమైనా రోడ్డుపై వెళుతున్న ఓ పాదచారి దుర్మరణం పాలవడం విషాదకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఫ్లైఓవర్ డిజైన్ లో ఏమైనా లోపాలున్నాయేమోనని పరిశీలిస్తామని వెల్లడించారు. కాగా, చీఫ్ ఇంజినీర్ల సూచన మేరకు ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.
KTR
Hyderabad
Telangana
Car
Road Accident

More Telugu News