వంశీ ఇంకా వైసీపీలో చేరలేదు కదా.. వస్తే చూద్దాం!: గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు
- గన్నవరంలో వంశీ వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారు
- వైసీపీలో చేరతానన్న ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను
- వంశీ వైసీపీలో చేరతారన్న విషయాన్ని మీడియాలోనే చూశాను
అసలు వంశీ వైసీపీలో చేరుతున్నారన్న విషయాన్ని తాను మీడియాలో చూడటమే తప్ప తనకూ తెలియదని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలోని తమ కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. తనకు అండగా ఉంటోన్న కార్యకర్తలకు తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను సమస్యలను సృష్టించడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.