California: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతి

  • శాన్ డియాగో లో కుటుంబ సభ్యులపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి
  • భార్య, పిల్లలను కాల్చి చంపిన వైనం
  • అనంతరం ఆత్మహత్య

అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో ఐదుగురు బలైపోయారు. కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. శాన్ డియాగో నగరంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడని, ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని వివరించింది.

కాల్పులకు తెగబడిన వ్యక్తికి 31 ఏళ్లు ఉంటాయని, తన మాజీ భార్యతో విభేదాల కారణంగా ఈ ఘటనకు పాల్పడ్డాడని అక్కడి మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో అతడి మాజీ భార్యతో పాటు 9 ఏళ్లలోపు ఉన్న ముగ్గురు కుమారులు మృతి చెందారని పేర్కొంది. అనంతరం తాను కూడా కాల్చుకొని ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఈ కాల్పుల్లో 11 ఏళ్ల మరో బాలుడు గాయపడ్డాడని, అతడికి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది.

More Telugu News