Telugudesam: ఆత్మహత్య చేసుకున్న నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్త.. ఎస్సై వేధింపులే కారణం?

  • నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కార్తీక్
  • ఎస్సై సుబ్బారావు వేధింపులే కారణమన్న కుటుంబసభ్యులు
  • వైసీపీ కోసం ఎస్సై చేసిన హత్య అన్న బీద రవిచంద్ర
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దగదర్తి ఎస్సై సుబ్బారావు వేధింపులు భరించలేక టీడీపీ కార్యకర్త కార్తీక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా కార్తీక్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ, వైసీపీ నేతలు చెప్పినట్టుగానే నడుచుకోవాలంటూ ఎస్సై వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హోటల్ ను కూడా తొలగించారని తెలిపారు.

మరోవైపు, కార్తీక్ కుటుంబసభ్యులను టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఇతర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కింది స్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారుల మాట వినడం లేదని అన్నారు. ఇది వైసీపీ నేతల కోసం ఎస్సై చేసిన హత్య అని ఆరోపించారు.
Telugudesam
Suicide
Nellore District
SI

More Telugu News