Crime News: తహసీల్దార్ చాంబర్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు
- కడప జిల్లాలో ఘటన
- మూడేళ్లుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న రైతు
- భూ సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో విసుగు
తహసీల్దార్ చాంబర్ లో ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకున్న ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. ఆ జిల్లాలోని కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ మూడేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ, తన పని జరగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
బి. ఆదినారాయణ (46) అనే రైతుకు బుక్కపట్నంలోని 122 సర్వేనంబర్లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉండగా, దాంట్లో 3.50 ఎకరాల భూమికి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి ఓ ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు. అయితే, మిగిలిన భూమిపై వివాదం చెలరేగుతోంది. ఆ భూమిలో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందంటూ దాన్ని తన తల్లి పేరుమీద ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్నాడు.
ఈ నేపథ్యంలో రైతు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయానికి ఈ పని మీదే మూడేళ్లుగా వచ్చిపోతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆయన నిన్న ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆయనపై నీళ్లు చల్లి మంటలు ఆర్పిన అక్కడి సిబ్బంది అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు.
బి. ఆదినారాయణ (46) అనే రైతుకు బుక్కపట్నంలోని 122 సర్వేనంబర్లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉండగా, దాంట్లో 3.50 ఎకరాల భూమికి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి ఓ ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు. అయితే, మిగిలిన భూమిపై వివాదం చెలరేగుతోంది. ఆ భూమిలో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందంటూ దాన్ని తన తల్లి పేరుమీద ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్నాడు.
ఈ నేపథ్యంలో రైతు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయానికి ఈ పని మీదే మూడేళ్లుగా వచ్చిపోతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆయన నిన్న ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆయనపై నీళ్లు చల్లి మంటలు ఆర్పిన అక్కడి సిబ్బంది అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు.