Vijayasai Reddy: 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నారు: బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు
  • 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉన్నారు
  • అయినా నిప్పు, తుప్పు అంటూ రంకెలేస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని అన్నారు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని ఇప్పుడు సుమతి శతకాలు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. 40 ఏళ్లుగా చంద్రబాబు దోచుకుంటూనే ఉన్నారని... దాన్ని ప్రజలు గుర్తించబట్టే పీకేసి, తరిమికొట్టారని చెప్పారు. అయినా నిప్పు, తుప్పు అంటూ రంకెలేస్తున్నారని అన్నారు.

ప్రజలు తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా గడవలేదని... కానీ, పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా, వీళ్లకు మాత్రం సిగ్గనిపించడం లేదని అన్నారు. వీళ్లకు పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కానీ, మరో పదేళ్లయినా ప్రజాభిమానాన్ని సంపాదించుకోలేరని చెప్పారు.
Vijayasai Reddy
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News