విడుదల చేయాలంటూ జైల్లోనే నిరహార దీక్షకు దిగిన నళిని
- 28 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నానంటూ లేఖ
- ఇదే కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న నళిని భర్త మురుగన్
- శుక్రవారం నుంచి ఆహారం తీసుకోకుండా నిరసన
ఇటీవల కుమార్తె వివాహంకోసం కొన్ని రోజులపాటు పెరోల్ పై నళిని బయటకు వచ్చింది. ఇప్పుడు తన మామ ఆరోగ్యం క్షీణించిందని మరో నెలరోజులు పెరోల్ కావాలని కోరింది. రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. గవర్నర్ ఈ సిఫారసుపై స్పందించలేదు.