Sujana Chowdary: ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన జగన్ 'రాజధాని'పై స్పందించాలి: సుజనా చౌదరి

  • రాజధానిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం ఉంది
  • ఈ గందరగోళానికి జగన్ తెరదించాలి
  • భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు
ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని... గందరగోళానికి తెరదించాలని చెప్పారు. ఈ అంశంపై జాతీయ పార్టీగా తాము ఇప్పుడే స్పందించలేమని అన్నారు.

 భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. ఏపీ, తెలంగాణల్లో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Sujana Chowdary
Jagan
BJP
YSRCP
Amaravathi

More Telugu News