Tamilisai: గిరిజన ప్రాంతాల్లో పర్యటనకు తెలంగాణ గవర్నర్

  • తండాల్లో నిద్ర చేసేందుకు సిద్ధమైన తమిళిసై
  • గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచన
  • రాజ్ భవన్లో అధికారులతో చర్చలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై దూకుడు పెంచుతున్నారు. జనాల్లోకి వెళ్లాలని ఆమె నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి, తండాల్లో నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, గిరిజన సంక్షేమంపై రాజ్ భవన్ లో అధికారులతో ఆమె సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ములుగులో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ నుంచి అనుమతులు తీసుకురావడానికి సహకరిస్తానని తెలిపారు. గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా భద్రాచలం, నాగర్ కర్నూలు నుంచి వచ్చిన కోయ, లంబాడాలతో కలిసి ఆమె నృత్యం చేశారు.

More Telugu News