Infosys: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులపై బయోపిక్

షార్ట్స్‌లో చూడండి
భారత్ లో ఐటీ విప్లవానికి నాంది పలికిన మూలపురుషుల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒకరు. ఆయన విజయగాథలో అర్ధాంగి సుధా నారాయణమూర్తికి ఎనలేని పాత్ర ఉంది. ఇప్పుడు వీరిద్దరి జీవితాల ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రం పేరు 'మూర్తి'. ఈ బయోపిక్ కు అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. అశ్వినీ గతంలో 'బరేలీ కి బర్ఫీ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న 'పంగా' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత 'మూర్తి' చిత్రం ప్రారంభం కానుంది. 'మూర్తి' చిత్రానికి అశ్వినితో పాటు ఆమె భర్త నితీశ్, మహావీర్ జైన్ లు కూడా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.
Go Back to Shorts
Infosys
Sudha
Ashwiny Iyer
Murthy
Narayanamurthy

More Telugu News