Pawan Kalyan: కొత్తగా వచ్చిన ప్రభుత్వం శుభకార్యాలతో పాలన మొదలుపెడుతుంది, వీళ్లు రావడమే కూల్చివేతలకు పాల్పడ్డారు: పవన్ కల్యాణ్

  • సర్కారుపై జనసేనాని ధ్వజం
  • ట్విట్టర్ లో స్పందన
  • కరెంటు కోతలపై ఏం శ్రద్ధ ఉంటుందని వ్యాఖ్యలు
ఏపీ సర్కారుపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ కొత్త ప్రభుత్వమైనా పాలన మొదట్లో మంచి పనులు చేస్తుందని, కొత్త ప్రాజెక్టులకు ఒప్పందాలు, పెట్టుబడులను ఆహ్వానించడం చేస్తుందని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చీరావడంతోనే ఇళ్ల కూల్చివేతలు, భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేయడం, ఆశా వర్కర్లను రోడ్ల మీదికి తీసుకురావడం, కేసులు పెట్టడం, అమరావతి రాజధాని లేకుండా చేయడం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లకి కరెంటు కొరతపై ఏం శ్రద్ధ ఉంటుందని పవన్ విమర్శించారు.
Pawan Kalyan
Jagan
YSRCP
Andhra Pradesh
Jana Sena

More Telugu News