Visakhapatnam District: నర్సీపట్నం మార్చురీలోనే మావోయిస్టుల మృతదేహాలు... తీసుకెళ్లడానికి రాని కుటుంబ సభ్యులు

షార్ట్స్‌లో చూడండి
విశాఖ మన్యం ఏరియాలో ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలు ఇప్పటికీ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అప్పటినుంచి వారి మృతదేహాలను నర్సీపట్నం మార్చురీలోనే భద్రపరిచారు. మృతదేహాలను తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ మృతదేహాలను తమకు అప్పగించాలని పౌరహక్కుల సంఘం నేతలు కోరుతున్నారు. పోలీసులు మాత్రం రక్తసంబంధీకులు, స్నేహితులకు మాత్రమే అప్పగిస్తామని స్పష్టం చేశారు. చనిపోయిన మావోయిస్టులను చత్తీస్ గఢ్ కు చెందినవారిగా గుర్తించారు.
Go Back to Shorts
Visakhapatnam District
Police

More Telugu News