బెయిలు మంజూరు కావడంతో ఇంటికి చేరిన కూన రవికుమార్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం హయాంలో విప్గా పనిచేసిన కూన రవికుమార్ నెల రోజుల అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్నారు. సరుబుజ్జిలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల స్థాయి అధికారులపై ఆయన దురుసుగా ప్రవర్తించడమేకాక పరుషంగా మాట్లాడారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తొలుత స్థానిక కోర్టులో బెయిల్కు పిటిషన్ వేసినా కోర్టు తిరస్కరించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్నారు.
అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తొలుత స్థానిక కోర్టులో బెయిల్కు పిటిషన్ వేసినా కోర్టు తిరస్కరించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్నారు.