కారుపై పడ్డ జరిమానా కట్టేందుకు బైక్ పై వస్తే, అది కూడా సీజ్!

షార్ట్స్‌లో చూడండి
తన కారుపై పడ్డ జరిమానాను చెల్లించేందుకు వెళ్లడానికి స్నేహితుని సహాయాన్ని అర్ధిస్తే, అతని బైక్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే, నోయిడా సమీపంలోని సెక్టార్-62లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న వేళ, ఓ కారును ఆపి, దానికి రిఫ్లక్టర్ లేదంటూ, జరిమానా వేశారు. దాన్ని ఆర్డీఓ వద్ద చెల్లించాలని సూచించారు. దీంతో అతను తన మిత్రుడిని సాయం కోసం పిలువగా, ఆ టూ వీలర్ కు నంబర్ ప్లేట్ లేదని గమనించిన అధికారులు ప్రశ్నించారు. తాను రెండు నెలల క్రితం వాహనాన్ని కొన్నానని, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదని చెప్పడంతో, ఆ బైక్ ను కూడా సీజ్ చేసి జరిమానా విధించారు. కాగా, ఇదే తరహా ఘటన నోయిడా సమీపంలోని నాలెడ్జ్ పార్క్ వద్ద కూడా జరిగింది.
Go Back to Shorts
New Delhi
Car
Bike
Sease
Fine

More Telugu News