Huzurnagar: హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

  • శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించిన కేసీఆర్
  • గత ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి ఓటమిపాలయ్యారు. మరోసారి ఆయనకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.

హుజూర్ నగర్ నుంచి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, హూజూర్ నగర్ కు ఉపఎన్నిక జరగనుంది.
Huzurnagar
By Election
TRS Candidate
Saidi Reddy
KCR

More Telugu News