New Delhi: 29 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు ఏకంగా రూ.130 కోట్ల శ్రీమంతుడయ్యాడు!

  • 20 వేల ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్న ఓ వ్యక్తి
  • రోడ్డు ప్రమాదంలో గాయంతో కోమాలోకి 
  • 2017లో మెలకువలోకి వచ్చిన బాధితుడు
  • 29 ఏళ్ల కాలంలో భారీగా పెరిగిన ఎంఆర్ఎఫ్ షేర్ల ధర
కోమా కారణంగా ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 1990లో ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన 20,000 షేర్లను నామమాత్రపు ధరకే కొన్నాడు. అనంతరం కొన్ని రోజులకే ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే మెరుగైన వైద్య చికిత్సతో 2017లోనే ఆయనకు స్పృహ వచ్చింది.

ఫిజియోథెరపీతో కోలుకున్న అనంతరం ఓ రోజు మనవడు రవితో ‘నేను 1990లో 20 వేల ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్నాను. ఆ కాగితాలు ఉన్నాయా?’ అని అడిగాడు. దీంతో తొలుత ఆశ్చర్యపోయిన రవి.. ఇంట్లో వెతకగా అందుకు సంబంధించిన పత్రాలు లభించాయి. ఈ విషయమై ఓ బిజినెస్ ఛానల్ కు ఫోన్ చేసిన రవి.. ఈ షేర్లను నగదు రూపంలోకి ఎలా మార్చుకోవాలని ఆర్థిక, షేర్ మార్కెట్ నిపుణులను ప్రశ్నించాడు.

దీంతో తొలుత డీమ్యాట్ అకౌంట్ తెరవాలని వారు సూచించారు. ఆ తర్వాతే ఈ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోగలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు చెప్పిన జవాబుకు రవికి మతిపోయింది. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ ఒక్కో షేర్ విలువ మార్కెట్ లో రూ.64,900గా ఉందనీ, ఈ లెక్కన రవి దగ్గర ఉన్న 20 వేల షేర్ల విలువ రూ.130 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. దీంతో రవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
New Delhi
coma since 1990
Gained consciousness in 2017
MRF's 20000 shares
grandson
Approched
Experts

More Telugu News