Andhra Pradesh: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగుల ఎంపిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 8 వరకూ  పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా 19 రకాల ఉద్యోగాల భర్తీకి 14 పరీక్షలు చేపట్టింది.

ఈ ఫలితాలను ప్రభుత్వ వెబ్ సైట్ http://gramasachivalayam.ap.gov.in/ లో చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తిచేసిన 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, వచ్చే నెల 1న రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం గాంధీజయంతి(అక్టోబర్ 2) రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. 
Go Back to Shorts
Andhra Pradesh
Grama sachiovalayam
Jagan
Chief Minister
Results
release

More Telugu News