Boat: బ్రేకింగ్ న్యూస్: 72 మందితో వెళుతున్న టూరిజం బోటు గోదావరిలో మునక

  • కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటు
  • లైఫ్ జాకెట్ల సాయంతో కొందరు సురక్షితం
  • సంఘటన స్థలికి తరలివెళ్లిన అధికారులు, పోలీసులు

గోదావరిలో ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 72 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు మునిగిపోయింది. బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు స్థానికుల కథనం. పోలవరం/గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు.

More Telugu News