Jagan: రెండేళ్లలో ప్రభుత్వాన్ని జగనే రద్దు చేస్తారు: దేవినేని ఉమ

  • జమిలి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిలవదు
  • తక్కువ కాలంలోనే ఎక్కువ అప్రతిష్టను మూటకట్టుకున్నారు
  • రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి.. పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారు
వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల వరకు ఉండబోదని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జమిలి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిలవదని చెప్పారు. రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని తనంతట తానే జగన్ రద్దు చేస్తారని తెలిపారు. అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ అప్రతిష్టను మూటకట్టుకున్న పార్టీ ఈ దేశంలో వైసీపీనే అని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పిన జగన్... ఇప్పుడు పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.
Jagan
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News