టీడీపీ నేత చింతమనేనిపై అట్రాసిటీ కేసు
- పరారీలో చింతమనేని
- గాలిస్తున్న పోలీసులు
- పక్క రాష్ట్రాలకు పారిపోయి ఉండొచ్చని అనుమానం
పరారీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్పై అట్రాసిటీ కేసు నమోదైంది. పరారీలో ఉన్న ఆయన కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. బహుశా ఆయన పక్క రాష్ట్రాలకు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, హైకోర్టులో చింతమనేని అనుచరులు క్వాష్ పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.