Jammu And Kashmir: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు మళ్లీ షాక్.. భారత్ కు జైకొట్టిన దక్షిణాసియా దేశాలు!

  • మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధిపై సదస్సు
  • హాజరైన దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్లు
  • రౌండ్ టేబుల్ భేటీలో పాక్ కు చుక్కెదురు
జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా మాల్దీవుల పార్లమెంటులో పాకిస్థాన్ కు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ అన్నది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని మాల్దీవుల్లో జరుగుతున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం చేసిన వాదనలను సదస్సు పట్టించుకోలేదు.

ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాక్ డిమాండ్ ను తిరస్కరించిన సదస్సు.. పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్(సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు. ఈ భేటీలో భారత ప్రతినిధి బృందానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు. ఆయన ప్రతిపాదించిన పలు సవరణలకు సదస్సులో ఏకగ్రీవ ఆమోదం లభించింది.
Jammu And Kashmir
India
Pakistan
south asia countries
speakers meet

More Telugu News