Andhra Pradesh: ఏపీలో నాట్లు వేసుకునేందుకు వచ్చే నెలాఖరు వరకు నీటి సరఫరా చేస్తాం: మంత్రి సుచరిత

  • గుంటూరు జిల్లాకు సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తాం
  • సాగునీటికి 65 టీఎంసీలు, తాగునీటికి 10 టీఎంసీలు  
  • మెట్ట పంటలు వేసే రైతులు మాగాణి పంటల వైపు వెళ్లొద్దు
ఏపీలో రైతులు నాట్లు వేసుకునేందుకు వచ్చే నెలాఖరు వరకు నీటి సరఫరా చేస్తామని మంత్రి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 75 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. మెట్ట పంటలు వేసే రైతులు మాగాణి పంటల వైపు వెళ్లొద్దని సూచించారు. సాగునీటికి 65 టీఎంసీలు, తాగునీటికి 10 టీఎంసీలు కేటాయిస్తామని అన్నారు. అవసరాలకు కేటాయించిన నీటిని అంతవరకే వినియోగించుకోవాలని సూచించారు.
Andhra Pradesh
Minister
Sucharita
Farmers

More Telugu News