Prabhas: 'జాన్'పై కూడా అంచనాలు పెంచేసిన ప్రభాస్

  • 'సాహో' తరువాత సినిమాగా 'జాన్'
  • యూరప్ లో కొంత చిత్రీకరణ పూర్తి 
  • డిఫరెంట్ లుక్ తో కనిపిస్తానన్న ప్రభాస్

ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభాస్ అభిమానులు 'సాహో' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రభాస్ కి, ఆ తరువాత చిత్రమైన 'జాన్' (పరిశీలనలో వున్న టైటిల్) సినిమా గురించిన ప్రశ్న ఎదురైంది.

అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. "రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో నేను డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాను. 1960-70 మధ్య కాలంలో సాగే కథతో ఈ సినిమా నడుస్తుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ యూరప్ లో జరిగింది. ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడని ఒక అంశాన్ని ఈ సినిమాలో రాధాకృష్ణ చూపించనున్నారు. ఆ అంశం ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేస్తుంది" అని ప్రభాస్ చెప్పడంతో, 'జాన్' పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News