Andhra Pradesh: ఏపీ మంత్రి వెల్లంపల్లికి మాతృవియోగం

  • అనారోగ్యంతో కన్నుమూసిన మహాలక్ష్మమ్మ
  • సోమవారం అంత్యక్రియలు
  • సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తల్లి మహాలక్ష్మమ్మ ఇవాళ మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాలక్ష్మమ్మ విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలని వెల్లంపల్లి కుటుంబీకులు నిర్ణయించారు. కాగా, వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సీఎం జగన్ సానుభూతి తెలియజేశారు. ఇతర  వైసీపీ నేతలు కూడా మంత్రిని పరామర్శించారు.
Andhra Pradesh
Vellampalli
Jagan

More Telugu News