Pakistan: ​రాజ్యాంగంలో మార్పుల పర్యవసానంగా కశ్మీర్ లో తీవ్రవాదం పెరిగితే మేం బాధ్యత వహించం: పాక్ అధ్యక్షుడు​​​​​​​​​​​​

షార్ట్స్‌లో చూడండి
కశ్మీర్ విషయంలో రాజ్యాంగంలో మార్పులు చేసిన పర్యవసానంగా తీవ్రవాదం పెరిగితే అందుకు పాకిస్థాన్ బాధ్యత వహించబోదని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ స్పష్టం చేశారు. భద్రతామండలిలో కశ్మీర్ అంశంపై చేసిన తీర్మానాలను భారత్ తుంగలో తొక్కిందని అన్నారు. పుల్వామా వంటి ఘటనలను భారత్ సాకుగా చూపి పాకిస్థాన్ పై భారత్ దాడులకు పాల్పడవచ్చేమో కానీ, తాము మాత్రం యుద్ధానికి వ్యతిరేకం అని అన్నారు.

ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే, ప్రత్యర్థిని ఎదుర్కొనే హక్కు తమకుందని తెలిపారు. భారత్ లో అధికారంలో ఉన్న మోదీ సర్కారు మూర్ఖుల స్వర్గంలో ఉందని, కశ్మీర్ విషయంలో నిప్పుతో చెలగాటమాడుతున్నారని అల్వీ విమర్శించారు. ఇస్లామాబాద్ లో విదేశీ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Go Back to Shorts
Pakistan
India
Jammu And Kashmir

More Telugu News