ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు
ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు సీబీఐ సమన్లు జారీ చేసింది. హైదరాబాదులోని సీబీఐ కోర్టు సమన్లను జారీ చేసింది. వచ్చే నెల 12న విచారణకు హాజరు కావాలని బొత్సను కోర్టు ఆదేశించింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.