Karnataka: కర్ణాటకలో భారీ వరదలు.. రూ.195 కోట్లు సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి యడియూరప్ప!

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 76 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుణుడి ప్రతాపంతో 22 జిల్లాల్లో 6.09 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈరోజు స్పందించారు.

వరద బాధితుల సహాయక చర్యల కోసం రూ.195 కోట్లు విడుదల చేసినట్లు యడియూరప్ప తెలిపారు. వరదల నియంత్రణ, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు దుస్తులు, ఇతర నిత్యావసరాల పంపిణీ కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. ఈ మొత్తాన్ని ఖజానా నుంచి విడుదల చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు యడియూరప్ప ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Karnataka
Chief Minister
yediturappa
flood
relief
Rs.195 crores
Twitter

More Telugu News