Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 39 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 18 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 8 శాతం వరకు లాభపడ్డ యస్ బ్యాంక్
ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 39 పాయింట్లు లాభపడి 37,350కి పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11,048 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (3.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.85%), మారుతి సుజుకి (2.74%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.70%), యాక్సిస్ బ్యాంక్ (1.86%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.87%), వేదాంత లిమిటెడ్ (-1.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.31%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.91%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.85%).
Sensex
Nifty
Stock Market

More Telugu News