Kanna: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో పనులు చేయించుకున్నారు.. ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: వైసీపీపై కన్నా ఫైర్

  • మైనింగ్ వ్యవహారంలో వ్యక్తులు మాత్రమే మారారు
  • అంతా గతంలో మాదిరే జరుగుతోంది
  • ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారు?

వైసీపీపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఎన్నో పనులు చేయించుకున్నారని... ఇప్పుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారని ప్రశ్నించారు. మైనింగ్ అక్రమ రవాణాలో కేవలం వ్యక్తులు మాత్రమే మారారని... వ్యవహారమంతా గతంలో మాదిరే జరుగుతోందని చెప్పారు. పల్నాడులో తలపెట్టిన ధర్నాను వాయిదా మాత్రమే వేశామని... రద్దు చేయలేదని తెలిపారు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

More Telugu News