Indian Air Force: బాలాకోట్ పై బాంబుల వర్షం కురిపించిన ఎయిర్ ఫోర్స్ పైలట్లకు అరుదైన గౌరవం

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్ లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేసిన భారత వాయుసేన పైలట్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వింగ్ కమాండర్ అమిత్ రంజన్, స్క్వాడ్రన్ లీడర్లు రాహుల్ బసోయా, పంకజ్ భుజాడే, బీకేఎన్ రెడ్డి, శంశాంక్ సింగ్ లను భారత ప్రభుత్వం వాయుసేన గ్యాలెంట్రీ మెడల్స్ తో సత్కరించనుంది. వీరంతా కూడా మిరేజ్-2000 యుద్ధ విమానాలతో జైషే ఉగ్ర స్థావరాలపై దాడి చేశారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసిన టెర్రరిస్టులు 40 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తీవ్రంగా ప్రతిస్పందించినన భారత్... వాయుసేనతో దాడులు చేయించింది.
Go Back to Shorts
Indian Air Force
Balakot Attack
Vayusen Medals

More Telugu News