Andhra Pradesh: ఏపీలో ఐదు కేన్సర్ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తాం: సీఎం జగన్

  • విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడపలో కేన్సర్ ఆసుపత్రులు
  • ‘ప్రకాశం’లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రి నిర్మిస్తాం   
  • వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో జగన్
ఏపీలో ఐదు కేన్సర్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడపలో పూర్తి స్థాయి సదుపాయాలతో ఈ కేన్సర్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రిని నిర్మిస్తామని, విజయనగరం, విశాఖ జిల్లాలోని పాడేరు, పల్నాడులోని గురజాలలో వైద్య కళాశాలలు నిర్మిస్తామని వెల్లడించారు. రాబోయే రెండు నెలల్లో వీటికి శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ‘108’, ‘104’ వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్ లో ఉండాలని, ఆరేళ్లకు ఓసారి ఆ వాహనాలను మార్చాలని సూచించారు. కొత్తగా వెయ్యి వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన టెండర్లు సెప్టెంబరులో ఖరారు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు, క్యూఆర్ కోడ్ తో కార్డులు జారీ చేస్తామని చెప్పారు.  
Andhra Pradesh
cm
jagan
Medical and Health

More Telugu News