మరికాసేపట్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో వన్డే జరగనుంది. వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో వన్డే అయినా సవ్యంగా సాగుతుందా లేదా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండో వన్డేకు ఆతిథ్యమిస్తున్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోనూ నిన్న వర్షం పడింది. దాంతో ఆటగాళ్లు ఇండోర్ ప్రాక్టీసుకే పరిమితమయ్యారు. మ్యాచ్ సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ నివేదిక చెబుతోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు దాదాపు ఎలాంటి మార్పు లేకుండా బరిలో దిగే అవకాశాలున్నాయి.
Go Back to Shorts
India
West Indies
Port Of Spain

More Telugu News