Ration: తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకున్న ఏపీ వాసులు.. విజయవంతమైన రేషన్ పోర్టబులిటీ
- రేషన్ తీసుకున్న విశాఖపట్టణం, రాజమండ్రి వాసులు
- ఆగస్టు ఒకటి నుంచి అమలు
- హర్షం వ్యక్తం చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్
తెలంగాణలో రేషన్ పోర్టబులిటీ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ వాసులు శుక్రవారం తెలంగాణలో రేషన్ కార్డులు తీసుకున్నారు. ఒకే దేశం-ఒకే కార్డు విధానాన్ని వచ్చే ఏడాది జూన్లోగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానం తెలంగాణ, ఏపీల్లో అమల్లో ఉంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్రలను రెండు క్లస్టర్లగా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ట్రయల్ రన్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ రేషన్ దుకాణంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, విశాఖపట్టణం జిల్లా యలమంచిలికి చెందిన ఇద్దరు వ్యక్తులు విజయవంతంగా రేషన్ సరుకులు తీసుకున్నారు.
ట్రయల్ రన్ విజయవంతం కావడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ పోర్టబులిటీని గతేడాది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వలసదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ట్రయల్ రన్ విజయవంతం కావడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ పోర్టబులిటీని గతేడాది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వలసదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.