Cricket: భారత క్రికెట్ జట్టుకు మారనున్న స్పాన్సర్.. ఒప్పో స్థానంలో ఇక ’బైజూస్’!

  • ఈ ఏడాది సెప్టెంబర్ లో భారత్ దక్షిణాఫ్రికా టూర్
  • అప్పటినుంచి ప్రారంభం కానున్న స్పాన్సర్ షిప్
  • రూ.1,079 కోట్లతో బీసీసీఐ-బైజూస్ ఒప్పందం

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ మారనున్నారా? ఒప్పో స్థానంలో మరో కంపెనీ చేరనుందా? అంటే బీసీసీఐ వర్గాలు అవుననే జవాబు ఇస్తున్నాయి. ఒప్పో స్థానంలో భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ కాంట్రాక్టును ప్రముఖ ఈ-లెర్నింగ్ యాప్ ‘బైజూస్’ దక్కించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికా పర్యటన నుంచి 2022, సెప్టెంబర్ వరకూ బైజూస్ కాంట్రాక్టు కొనసాగుతుందని వెల్లడించాయి. ఇందుకోసం  రూ.1,079 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.

2017, మార్చిలో ఒప్పో బీసీసీఐతో రూ.1,079 కోట్లతో ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం టీమిండియా ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఒప్పో సంస్థ ఒక్క రోజుకు రూ 4.61 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.1.56 కోట్లు చెల్లించేది. అయితే 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్న కారణంతో ఈ డీల్ నుంచి ఒప్పో తప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒప్పో స్థానంలో అంతే మొత్తానికి బైజూస్ స్పాన్సర్ చేసేందుకు ముందుకొచ్చిందని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.

More Telugu News