Andhra Pradesh: ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు: నారా లోకేశ్ ఫైర్

  • వైసీపీపై నారా లోకేశ్ మరోమారు ఆగ్రహం
  • ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పరే?
  • సమాధానం చెప్పకపోగా రెచ్చిపోతున్నారు
వైసీపీపై ఏపీ టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విరుచుకుపడ్డారు. ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారపక్ష సభ్యులు నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రసంగ వీడియోను పోస్ట్ చేశారు. ‘మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా?’ అని లోకేశ్ ప్రశ్నించారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP

More Telugu News