CRDA: సీఆర్డీఏ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు
కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాల కట్టడాల విషయమై సీఆర్డీఏ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును న్యాయస్థానం ‘రిజర్వ్’లో ఉంచింది. కరకట్టపై చందన బ్రదర్స్ భవనానికి ఇచ్చిన స్టే ఎత్తివేయాలని హైకోర్టును సీఆర్డీఏ కోరింది. ఒకవేళ ఈ భవనానికి స్టే ఇస్తే కనుక కరకట్టపై ఉన్న మిగిలిన భవనాల యజమానులు తమకూ స్టే ఇవ్వాలని కోరతారని సీఆర్డీఏ తమ వాదనలు వినిపించింది.