రూ.4 లకు కక్కుర్తి పడిన హోటల్ యజమానికి రూ.15 వేలు వదిలింది
- పెరుగుపై జీఎస్టీ వేసిన వ్యాపారి
- ఫోరాన్ని ఆశ్రయించిన వినియోగదారుడు
- రూ.10 వేల జరిమానా, ఖర్చులకు మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశం
దీంతో బాధితుడి తరపున న్యాయవాది బ్రహ్మం తిరునల్వేలి జిల్లా వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో వాణిజ్య విభాగం అధికారులను న్యాయస్థానం విచారించగా పెరుగుపై జీఎస్టీ లేదని, ప్యాకింగ్కు కూడా ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని తెలియజేశారు. దీంతో న్యాయమూర్తి వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
పెరుగు కొనేందుకు వచ్చిన అతనికి మనోవేదన కలిగించినందుకు రూ.10 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు, జీఎస్టీ, పార్సిల్ కోసం అతని వద్ద నుంచి వసూలు చేసిన రూ.4 కలిపి మొత్తం 15,004 రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హోటల్ యజమానిని న్యాయమూర్తి దేవదాస్, సభ్యులు శివమూర్తి, ముత్తులక్ష్మిలు తీర్పులో ఆదేశించారు. సకాలంలో డబ్బు చెల్లించని పక్షంలో ఆరు శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు చెప్పారు.