Telangana: సచివాలయంలోని పోచమ్మగుడి, మసీదును ఎలా కూలుస్తారు?: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్ తన మూఢ విశ్వాసాలను ప్రజలపై రుద్దుతున్నారని టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సచివాలయంలోని పోచమ్మగుడి, మసీదును ఎలా కూలుస్తారు? అని ప్రశ్నించారు. ఈ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టులు చెప్పడమంటే బాధ్యతల నుంచి అవి తప్పుకోవడమేనని విమర్శించారు. సచివాలయం, అసెంబ్లీ కూల్చివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దేనని అన్నారు. ఈ విషయమై గవర్నర్ స్పందించకపోతే రాజ్ భవన్ ని ముట్టడిద్దామని, గవర్నర్ ను కూడా బాధ్యుడ్ని చేసి కోర్టులో పిటిషన్ వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Telangana
secretariat
Assembly
congress
Revanth Reddy
kcr
Governor
Narasimhan

More Telugu News