కడప, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 9న పర్యటిస్తా!: టీడీపీ అధినేత చంద్రబాబు
- టీడీపీకి 40 శాతం ప్రజలు ఓటేశారు
- వారందరికీ మేం అండగా నిలుస్తాం
- ఉండవల్లిలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఏపీ సీఎం జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, సంక్షేమ పథకాల కోసం కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు సాధించాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో విత్తనాలు-ఎరువుల సమస్య, విద్యుత్ కోతలు, మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు.. ఇలా ఏ సమస్య వచ్చినా టీడీపీపై తోసి తప్పుకోవాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ఏపీలో ప్రస్తుతం భయానక వాతావరణం సృష్టించారనీ, నేరాలు-ఘోరాలే పార్టీ విధానంగా ముందుకు వెళతున్నారని దుయ్యబట్టారు. ఇలాగే సాగితే వైసీపీని ప్రజలే దూరం పెడతారని హెచ్చరించారు.