Ravishankar Prasad: భారత్ లో పెరిగిన టీవీల దిగుమతి!

  • మొత్తంగా రూ. 7,224 కోట్ల విలువైన టీవీల దిగుమతి
  • సగానికి పైగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న భారత్
  • తర్వాతి స్థానాల్లో వియత్నాం, మలేషియా, హాంకాంగ్, తైవాన్
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ రూ.4,962 కోట్ల విలువైన టీవీలు అధికంగా దిగుమతి చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. నేడు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, రూ. 7,224 కోట్ల విలువైన టీవీలను భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకున్నట్టు స్పష్టం చేశారు.

వీటిలో సగానికి పైగా దిగుమతులను చైనా నుంచి చేసుకోగా, వియత్నాం, మలేషియా, హాంకాంగ్, తైవాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా చేసుకున్న దిగుమతుల్లో ఈ ఐదు దేశాల నుంచి రూ. 7,011 కోట్ల విలువైన టీవీలను భారత్ దిగుమతి చేసుకున్నట్టు రవిశంకర ప్రసాద్ వెల్లడించారు. ఎల్ఈడీ, ఎల్‌సీడీతో పాటు ప్లాస్మా టీవీలను దేశీయంగా తయారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు.
Ravishankar Prasad
India
Chaina
TV
Plasma
LED
Malasiya

More Telugu News