BJP: 6న హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదును ప్రారంభించనున్న అమిత్ షా

  • 40 శాతం సభ్యత్వాన్ని అదనంగా పెంచబోతున్నాం
  • 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
  • కొత్తగా చేరే నేతలను అమిత్ షాకు పరిచయం చేస్తాం

ఇకపై బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని, ఈ విషయమై చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని, అదే రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సారి 40 శాతం సభ్యత్వాన్ని అదనంగా పెంచబోతున్నట్టు తెలిపారు. 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్ షాకు పరిచయం చేస్తామని లక్ష్మణ్ తెలిపారు.

More Telugu News