Syam Lal Jadav: పాత బాంబు పేలడంతో చిన్నారి సహా ముగ్గురి మృతి

షార్ట్స్‌లో చూడండి
ఓ కుటుంబానికి ఆర్మీకి చెందిన పాత బాంబు ఒకటి దొరకడంతో, అందులోని కాంస్య లోహాన్ని తీయడానికి యత్నించారు. దీంతో అది పేలి ఏడాది వయసున్న చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని మసుదా గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ జాదవ్(55), అతని కుమార్తె, ఏడాది వయసున్న ఆమె చిన్నారితో కలిసి నేటి ఉదయం ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వైపు వెళుతుండగా ఆ పక్కనే పాత బాంబు ఒకటి దొరికింది. అందులోనుంచి కాంస్య లోహాన్ని బయటకు తీసేందుకు యత్నించారు. ఆ సమయంలో బాంబు కాస్తా పేలి చిన్నారి సహా తండ్రీకూతుళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా అక్కడే ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Syam Lal Jadav
One Year baby
Army Bomb
Uttar Pradesh
Firing Range
Police

More Telugu News