Andhra Pradesh: చంద్రబాబు పసుపు-కుంకుమ ఇస్తే.. ప్రజలు ఆయన కళ్లలో కారం కొట్టారు!: మోత్కుపల్లి

షార్ట్స్‌లో చూడండి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు పసుపు-కుంకుమ కింద నగదు ఇచ్చారని తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. అయితే ఎన్నికల ముందు మేం గుర్తుకువచ్చామా? అని మహిళలు చంద్రబాబు కళ్లలో కారం కొట్టారని విమర్శించారు.

‘నువ్వు పెద్ద కొడుకువి కాదు. పెద్ద తాతవి. నీకు మెంటల్ వచ్చింది.  బుర్ర పనిచేయడం లేదు. పెద్ద కొడుకు ఎవరైనా ఉంటే అది జగన్ మాత్రమే’ అని ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి ఈ మేరకు మాట్లాడారు.

Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
motkupalli
Jagan
pasupu kumkuma

More Telugu News