kcr: కేసీఆర్, జగన్ ల తదుపరి సమావేశం ఏపీలో!

  • ఈసారి ఏపీలో భేటీ కానున్న కేసీఆర్, జగన్
  • వచ్చే నెల 9, 10 తేదీల్లో సమావేశం
  • పలు అంశాలపై లోతుగా చర్చలు
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కలసికట్టుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని వీరు భావిస్తున్నారు. గోదావరి జలాలను కృష్ణకు తరలించేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు హైలెవెల్ మీటింగ్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరో రెండు వారాల్లో మరోసారి భేటీ కావాలని తాజాగా నిర్ణయించారు. వచ్చే నెల 9, 10 తేదీల్లో ఏపీలో ఇరువురు సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో విద్యుత్, ఏపీ భవన్, పౌరసరఫరాలు, ఉద్యోగుల విభజనపై లోతుగా చర్చించనున్నారు. ఇరు రాష్ట్ర సమస్యలపై అధికారులు ఇప్పటికే స్పష్టతకు వచ్చారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎస్ లు తిరుపతిలో భేటీ కానున్నారు. అనంతరం ఇరువురు సీఎంలు సమావేశమవుతారు.
kcr
jagan
meeting

More Telugu News