Nara Lokesh: మంగళగిరిలో హత్యకు గురైన ఉమాయాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్

  • నిన్న మంగళగిరిలో ఉమాయాదవ్ దారుణహత్య
  • టీడీపీ వర్గాల్లో కలకలం
  • అండగా నిలుస్తామంటూ ఉమా కుటుంబసభ్యులకు లోకేశ్ భరోసా

మంగళగిరిలో అందరూ చూస్తుండగానే టీడీపీ నేత ఉమాయాదవ్ ను దారుణంగా హత్యచేయడం తెలిసిందే. నిన్న జరిగిన ఈ హత్య టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హత్యకు గురైన ఉమాయాదవ్ కుటుంబ సభ్యులను ఆయన ఇవాళ పరామర్శించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నారా లోకేశ్ తో పాటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఉమాయాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉమాయాదవ్ ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. నారా లోకేశ్ సమక్షంలో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో తన అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నారు.

More Telugu News